News August 7, 2024

నా సొంత డబ్బులు రైతులకు కట్టా: ఎంపీ

image

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పుంగనూరు ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ నిర్మాణంలో రైతులు నష్టపోకుండా తమ సొంత నిధులు రూ.1.49 కోట్లను నష్టపరిహారంగా చెల్లించామని గుర్తించారు. టీడీపీ కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకుందన్నారు.

Similar News

News October 14, 2025

చిత్తూరు: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుకు దరఖాస్తులు

image

అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు.APPSDC స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ఉచిత అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కోర్సుకు 5 నుంచి ఏదైన ఉన్నత విద్యవరకు చదివిన వారు అర్హులన్నారు. ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 14, 2025

చిత్తూరు: 17న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

image

ఈనెల 17న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ సెమినార్ పోటీలకు అర్హులన్నారు. క్వాంటం యుగం ప్రారంభం-అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 17న ఉ.10 గంటలకు జిల్లా కేంద్రం లోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెమినార్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.

News October 14, 2025

చిత్తూరు: యువతకు క్రీడా పోటీలు

image

వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ బాగా ఆడితే జాతీయస్థాయిలో నిర్వహించే యువజన పోటీలకు పంపిస్తామని చెప్పారు. జిల్లాస్థాయి పోటీలు ఈనెల 15న చిత్తూరు సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతాయన్నారు.