News September 13, 2024

నిండుకుండలా గండికోట జలాశయం

image

గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. జలాశయంలో 24.85 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు జనవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం 11 గంటలకు మైలవరం జలాశయానికి నీరు వదులుతున్నట్లు సమాచారం. అవుకు రిజర్వాయర్ నుంచి 10,000 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి వస్తున్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 2,990 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News October 23, 2025

కడప జిల్లాలో 2,661 హెక్టార్లలో పంట నష్టం: DAO

image

వర్షాల వల్ల కడప జిల్లాలోని 63 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) చంద్ర నాయక్ తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం 2,661 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. వరి-1,970 హెక్టార్లు, కంది-258 హెక్టార్లు, మినుము-228 హెక్టార్లు, వేరు శనగ-84 హెక్టార్లు, పత్తి-81 హెక్టార్లు, మొక్కజొన్న-40 హెక్టార్లలో దెబ్బ తిన్నాయని వివరించారు.

News October 23, 2025

కడప: తుఫాన్.. విద్యుత్ సమస్యలపై కాల్ చేయండి.!

image

వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*కడప జిల్లా కంట్రోల్ రూమ్ 94408- 17440,
*కడప డివిజన్ -99017 61782
*పులివెందుల – 78930-63007
*ప్రొద్దుటూరు -78932-61958
*మైదుకూరు-98490 57659
విద్యుత్ ప్రమాదాలు జరిగితే పై నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

News October 23, 2025

కడప జిల్లా నుంచి ఆలయాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించేందుకు కడప జిల్లాలోని 6 డిపోల పరిధిలో 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 3, 10, 17తేదీల్లో పొలతల క్షేత్రం, నిత్యపూజ కోన, లంకమల్ల, అగస్తీశ్వర కోన, కన్యతీర్థం, నయనాలప్ప కోన, పుష్పగిరి, శ్రీశైలం తదితర క్షేత్రాలకు బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.