News September 2, 2024

నిండు గర్భిణికి తప్పని నడక..!

image

నిండు గర్భిణి 2 కిలో మీటర్లు కష్టపడి నడక సాగించిన దుస్థితి అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసింది. దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ రామన్నపాలేనికి చెందిన గర్భిణి దుంబరి నూకాలమ్మకు ప్రసవ సమయం దగ్గర పడింది. భారీ వర్షాల దృష్ట్యా ఆమెను ముందుగానే ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఈక్రమంలో ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో గర్భిణి కొంతదూరం నడక సాగించాల్సి వచ్చింది. 

Similar News

News December 4, 2025

విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

image

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.