News January 24, 2025
నిజమైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు: కలెక్టర్ సంతోష్

నిజమైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకే ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నామని నాగర్ కర్నూల్ కలెక్టర్ బధావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని అన్నారు.
Similar News
News November 27, 2025
వరంగల్: తొలి విడతలో 555 పంచాయతీలకు నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో భాగంలో 23 మండలాల్లోని 555 గ్రామ పంచాయతీలకు, 4952 వార్డులకు నామినేషన్లు వేయనున్నాను. అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడానికి 171 కేంద్రాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగులో 15, హనుమకొండలో 24, వరంగల్లో 29, జనగామలో 30, భూపాలపల్లిలో 24, మహబూబాబాద్లో 49 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News November 27, 2025
బాపట్ల: ఇబ్బందులా.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

బాపట్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగితే ఫోన్ నంబర్ 1967 లేదా 77028 06804లను సంప్రదించాలని సూచించారు. ఈ నెంబర్లను కలెక్టర్ బుధవారం విడుదల చేశారు.
News November 27, 2025
నాయకుల ‘ఏకగ్రీవ’ ప్రకటనలు.. ఓటుకు విలువ లేదా?

TG: పంచాయతీ ఎన్నికల వేళ నాయకుల ఆఫర్లు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తమ పార్టీ వ్యక్తి సర్పంచ్గా ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి ₹10L-30L ఇస్తామంటున్నారు. అయితే ప్రజల ఓట్లతో గెలిస్తే నిధులివ్వరా? ఏకగ్రీవ ప్రస్తావన చట్టాల్లో ఉన్నప్పటికీ ఓటుకు విలువ లేదా? ‘పెద్దలు’ ఏకమై ఏకగ్రీవాలు చేసుకుంటే.. తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు ప్రజలు కోల్పోవడం సమంజసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరేమంటారు?


