News May 12, 2024
నిజాంపట్నంలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

మండలంలోని అచ్చుతపురం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పెనుమూడి నుంచి నిజాంపట్నం వెళుతున్న బైకును టాటా మ్యాజిక్ ఢీకొట్టడంతో కొక్కిలిగడ్డ శివకృష్ణ అనే వ్యక్తి మృతిచెందాడు. కొక్కిలిగడ్డ నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2026
హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్వే కోసం కసరత్తు

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.
News April 11, 2026
జనభాగణన శిక్షణకు హాజరవ్వకుంటే చర్యలు: కలెక్టర్

పీజీఆర్ఎస్ ఫిర్యాదులను 12 గంటల్లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనాభా గణన పై జిల్లా వ్యాప్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని, శిక్షణా కార్యక్రమానికి హాజరు కాని వారి పై చర్యలు చేపట్టడతామన్నారు. రాబోయే రోజుల్లో డయేరియా ప్రబలకుండా చూడాలన్నారు.
News April 11, 2026
జనభాగణన శిక్షణకు హాజరవ్వకుంటే చర్యలు: కలెక్టర్

పీజీఆర్ఎస్ ఫిర్యాదులను 12 గంటల్లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనాభా గణన పై జిల్లా వ్యాప్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని, శిక్షణా కార్యక్రమానికి హాజరు కాని వారి పై చర్యలు చేపట్టడతామన్నారు. రాబోయే రోజుల్లో డయేరియా ప్రబలకుండా చూడాలన్నారు.


