News September 26, 2024

నిజాంసాగర్‌లో చిరుత సంచారం

image

నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్ రావ్ పల్లి చౌరస్తా – నిజాంసాగర్ రహదారిపై గల సైలాని బాబా దర్గాకు సమీపంలో చిరుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినట్లు వాహనదారులు తెలిపారు. అచ్చంపేట్ మోడల్ స్కూల్, మాగి ఫ్యాక్టరీ ప్రాంతాల్లో గతంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే.

Similar News

News November 27, 2025

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: NZB కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్న పోలింగ్‌లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

News November 27, 2025

NZB: జిల్లాలో తొలి రోజు నామినేషన్లు ఎన్ని అంటే?

image

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో GP ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. 184 సర్పంచి స్థానాలకు సంబంధించి 140 నామినేషన్లు, 1,642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.

News November 27, 2025

NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.