News February 13, 2025
నిజాంసాగర్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బుర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఎల్లారెడ్డి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన తిమ్మయ్య(48) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని కుమారుడు యేసు ప్రభు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Similar News
News December 9, 2025
జిల్లాలో యూరియా కొరత లేదు: ప.గో కలెక్టర్

ప.గో జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పంటకు, యూరియాకు సంబంధించి జిల్లాస్థాయిలో 83310 56742 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.
News December 9, 2025
శ్రీకాకుళం: ఏపీ టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

శ్రీకాకుళం, బరంపూర్ గంజాం ఒడిశాలో జరగనున్న ఏపీ టెట్-2025 కంప్యూటర్ పరీక్షకు ఏడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం పదివేల 499 మంది అభ్యర్థులు హాజరవుతారని డీఈవో రవి బాబు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 10 నుంచి 21 వరకు రెండు పూటలు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 9221 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు MEOలను డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించారన్నారు.
News December 9, 2025
ఈ టైమ్లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it


