News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 25, 2025

ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్‌కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్‌వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT

News October 25, 2025

జాగ్రత్త.. పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

image

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్‌ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్​వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.

News October 25, 2025

మేడ్చల్ మార్గంలో రైల్వే ETS అప్ గ్రేడేషన్ మంజూరు

image

మేడ్చల్, మహబూబ్‌నగర్, ధోనే మార్గంలో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అప్ గ్రేడేషన్ మంజూరైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రెస్ నోట్ విడుదల చేసింది. రైల్వే మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకోగా, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం (ETS) త్వరలోనే అమలు చేస్తామని పేర్కొంది. ఈ పనులు పూర్తయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లు ప్రయాణించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు.