News February 15, 2025
నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.


