News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 12, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడి దుర్మరణం

image

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు దుర్మరణం చెందాడు. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన చిట్టెం హనుమాండ్లు(54) NZBలో గోల్ హనుమాన్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించేవారు. బైక్‌పై తన దగ్గర పని చేసే శ్రీహరితో కలిసి వెళ్తుండగా పులాంగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో హనుమాండ్లు మృతి చెందగా శ్రీహరికి గాయాలయ్యాయి.

News March 12, 2025

NZB: 477 మంది గైర్హాజరు

image

జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ 2వ సంవత్సరం బోటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-2ఏ పరీక్షకు మొత్తం 477 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారన్నారు.

News March 12, 2025

NZB: గ్రూప్-2 ఫలితాల్లో జిల్లా వాసికి 6వ స్థానం

image

గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను TGPSC విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన ఎర్ర అఖిల్‌కు 430.807 మార్కులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అభినందించారు.

error: Content is protected !!