News February 16, 2025
నిజాంసాగర్: ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను, కళాశాలను ఆదివారం కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి సలాం సందర్శించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షను ఆయన పర్యవేక్షించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News November 22, 2025
నిర్మల్: మండలాలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ

జిల్లాలోని పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 18 ఫాగింగ్ యంత్రాలను మండలానికి ఒకటి చొప్పున ఎంపీఓలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అందించారు. ఫాగింగ్ యంత్రాలను సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. దోమలను సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.
News November 22, 2025
సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్లో ఎందుకు బ్యాటింగ్కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?
News November 22, 2025
అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


