News February 16, 2025

నిజాంసాగర్: ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను, కళాశాలను ఆదివారం కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి సలాం సందర్శించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షను ఆయన పర్యవేక్షించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Similar News

News October 24, 2025

ఇళ్ల కోసం అర్హులను గుర్తించండి: మంత్రి ఆదేశాలు

image

నవంబర్ 5లోగా ఆన్లైన్లో ఇళ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకొని విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూచించారు. అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు.

News October 24, 2025

వర్గల్: సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలి: గవర్నర్

image

విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను, పరిశోధనలను అభివృద్ధి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. వర్గల్ మండలంలోని కావేరి విశ్వవిద్యాలయం, కావేరి సీడ్ కంపెనీని సందర్శించి ప్రభుత్వం విద్య రంగంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి గవర్నర్ తెలిపారు. కావేరి యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్‌ను పరిశీలించారు.

News October 24, 2025

గాజా డీల్‌ను బలహీనపరిస్తే నెతన్యాహుపై తీవ్ర చర్యలు!

image

వెస్ట్ బ్యాంక్ <<18087139>>స్వాధీనానికి <<>>ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్‌ను ఆ దేశ PM నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ US అధికారి హెచ్చరించారు. ‘ట్రంప్‌తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్‌ను నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు.