News March 15, 2025
నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.
News November 20, 2025
మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.
News November 20, 2025
సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.


