News March 15, 2025

నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

Similar News

News March 17, 2025

Stock Markets: నిఫ్టీ 150+, సెన్సెక్స్ 450+ అప్

image

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,549 (+153), సెన్సెక్స్ 74,275 (+470) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, మెటల్, ఎనర్జీ, PSE, CPSE, వినియోగం, చమురు, బ్యాంకు షేర్లకు గిరాకీ ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఎగిశాయి. ఇండస్‌ఇండ్, బజాజ్ ట్విన్స్, SBI లైఫ్, Dr రెడ్డీస్ టాప్ గెయినర్స్. నెస్లే, BPCL టాప్ లూజర్స్.

News March 17, 2025

భువనగిరి కోటపైన రోప్ వే

image

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.

News March 17, 2025

1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

image

TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్‌పై ప్రభుత్వం చర్యలకు దిగింది.

error: Content is protected !!