News March 29, 2025
నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు తెరవాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పాఠశాలలను శుక్రవారం నుంచి యథావిధిగా తెరవాలని కలక్టర్ విజయ్కృష్ణన్ ఆదేశించారు. పాఠశాలల శానిటేషన్, క్లోరినేషన్ విషయంలో శ్రద్ద తీసుకొవాలాన్నారు. విద్యార్థుల భద్రతకు టీచర్స్ అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. విద్యార్థులు కాల్వలు, రోడ్డు దాటేతప్పుడు పేరెంట్స్ తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ స్తంబాలు, నీటికుంటలు దగ్గరకు విద్యార్థులు వెళ్లకుండా చూడాలన్నారు.
News October 31, 2025
అమలాపురం: విద్యార్థులకు అరుదైన అవకాశం

‘స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషన్ టు ఢిల్లీ’ కార్యక్రమానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యార్థినులు ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. పైడి కొండల రాజేశ్వరి, రాచకొండ సృజన, జ్ఞానపూర్ణ దేవి దీక్షిత, ఎంహెచ్ఎస్ వి అనూష ఎంపికైన వారిలో ఉన్నారని డీఈవో వెల్లడించారు.
News October 31, 2025
వరల్డ్ కప్లో అదరగొట్టిన కడప అమ్మాయి

ఉమెన్స్ వరల్డ్ కప్లో కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ఆదరగొడుతోంది. ఎర్రగుంట్ల RTPPకి చెందిన ఆమె వరల్డ్ కప్లో మొదటి నుంచి రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో 2 వికెట్లు తీశారు. అయితే 10 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇండియా ఫైనల్కి చేరడంలో తనవంతు పాత్ర పోషించడంతో శ్రీచరణిని పలువురు అభినందిస్తున్నారు.


