News February 1, 2025
నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా మూడో విడత నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ శివకుమార్ తెలిపారు. రెండో విడతలో ఇప్పటి వరకు 3.84 టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు. మూడో విడతలో 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Similar News
News February 19, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR
News February 19, 2025
MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్తో తలనొప్పి!

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?
News February 19, 2025
జగిత్యాల జిల్లాలో నేటి CRIME NEWS!

@మెట్పల్లి ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ కోరుట్లలోని కాంగ్రెస్ నేతల డిమాండ్ @మల్యాలలో కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు @కొడిమ్యాలలో దారి తప్పిన చుక్కల దుప్పి @భీమారంలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @రేపు మల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక బహిరంగ వేలం @ఇబ్రహీంపట్నంలో చోరికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు @జగిత్యాల ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్