News June 22, 2024

నిజాం నగలు.. హైదరాబాద్‌‌కు తేవాలని డిమాండ్!

image

నిజాం నగలను HYDకు తీసుకురావాలన్న‌ డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వజ్రాభరణాలను భద్రపరిచారు. 2001, 2006‌లో వీటిని నగరంలోనూ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తే‌ నగలు ఇక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది లేదని గతంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో వీటిని‌ ప్రదర్శిస్తే బాగుంటుందని‌ నగరవాసులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News September 18, 2025

BREAKING.. HYDలో భారీ ట్రాఫిక్.. 5KMల వరకు నరకం..!

image

HYDలో కొద్ది గంటలుగా కురుస్తోన్న వర్షంతో నగరంలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో అమీర్‌పేట్- బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ- బేగంపేట్, సికింద్రాబాద్‌‌‌‌కు వెళ్లే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 5 KMల వరకు ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా, ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులెవరూ ఇంకా రంగంలోకి దిగకపోవడం గమనార్హం.

News September 18, 2025

జూబ్లీ అభయం: ఒకరికి CM.. మరొకరికి పీసీసీ..!

image

జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపులో కొత్త రాజకీయం బయటకు వస్తుందని గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వెనక పీసీసీ వర్గం ఉన్నట్లు అంచనా. అంజన్‌కు టికెట్ ఇప్పించేందుకు పీసీసీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నవీన్ కుమార్ లేదా దానం నాగేందర్‌కు మద్దతుగా ఉన్నట్లు టాక్.

News September 18, 2025

ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.