News August 4, 2024
నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతా: షబ్బీర్ అలీ

నిజామాబాద్ పట్టణాన్ని రూ.300 కోట్ల అమృత్ నిధుల ద్వారా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. నీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు పరిస్కరిస్తానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు.
Similar News
News December 4, 2025
NZB: 3వ విడత తొలిరోజు 579 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం 579 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 174 మంది, 1,620 వార్డు మెంబర్ స్థానాలకు 405 మంది నామినేషన్లు వేశారు.
News December 3, 2025
NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
News December 3, 2025
NZB: స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్లను పరిశీలించిన అబ్జర్వర్

నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) సెల్ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. మానిటరింగ్ సెల్ను తనిఖీ చేశారు. నిఘా బృందాల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.


