News July 11, 2024

నిజామాబాద్‌లో ఆయన కట్టడాలు ప్రత్యేకం!

image

నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని రాష్ట్ర ఇంజినీర్స్ డేగా జులై 11న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ‘బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ’ని ఆయన నిర్మించారు. వాటితో పాటు అలీ సాగర్ జలాశయానికి ఆయనే నామకరణం చేశారు.

Similar News

News January 9, 2026

టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

image

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.

News January 9, 2026

బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

News January 9, 2026

టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.