News March 25, 2024
నిజామాబాద్లో మాయమాటలు చెప్పి లక్ష మాయం

నిజామాబాద్ పెద్ద బజారులోని లక్ష్మీనరసింహ కిరాణ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ICICI బ్యాంక్ ఉద్యోగినంటూ యాజమానిని నమ్మించాడు. కరెంట్ అకౌంట్తో పాటు క్యూఆర్ కోడ్ అప్డేట్ చేయాలని చెప్పి, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు అడిగాడు. యాప్ డౌన్లోడ్ చేస్తానని నమ్మించి ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.లక్ష మాయమైనట్టు గుర్తించిన బాధితుడు రాజ్ కుమార్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Similar News
News November 20, 2025
నిజామాబాద్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి, రెంజల్, డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, వేల్పూర్, మాక్లూర్, జక్రాన్ పల్లి, ఏర్గట్ల, కోటగిరి, పొతంగల్, వర్ని, మోస్రా మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 20, 2025
అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

అక్రమ కేసులతో బీఆర్ఎస్, కేటీఆర్ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.
News November 20, 2025
NZB: మూగజీవాలను సైతం వణికిస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలలో వణికిస్తున్న చలిపులి మూగజీవాలను సైతం వదలడం లేదు. చలికి మనుషులతో పాటు మూగజీవాలు కూడా గజగజ వణుకుతున్నాయి. కొందరు చలిమంట వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతుండగా వారు వేసుకున్న చలిమంట వద్ద మూగజీవాలు సేదదీరుతున్నాయి. NZB నగరంలో రెండు కుక్క పిల్లలు వెచ్చదనం కోసం ఇలా చలి మంటకాచుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


