News April 2, 2024
నిజామాబాద్లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్లో జరిగింది. గౌతమ్ నగర్కు చెందిన శ్రీనివాస్(56) సోమవారం రాత్రి ఇంట్లో గొడవ పడి అర్ధరాత్రి తర్వాత మిర్చి కాంపౌండ్ రైల్వే గేట్ వద్ద జైపూర్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. అతడు నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 12, 2025
NZB: నేటి నుంచి నిషేధాజ్ఞలు: CP

ఈ నెల 14 న నిజామాబాద్ డివిజన్లో నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం శుక్రవారం నుంచి 163 BNSS ఉత్తర్వులు జారీ చేసినట్లు CPసాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్లోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు.
News December 12, 2025
ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
News December 12, 2025
NZB: ఈ నెల 27వ తేదీలోగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడువు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జీజీ కళాశాల అధ్యయన కేంద్రంలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ,1, 3, 5వ సెమిస్టర్& ఎంబీఏ, బీఎల్ఎస్సీ 2వ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 27తేదీలోగా పరీక్షా ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డా.కె.రంజిత తెలిపారు. ప్రాక్టికల్స్ ఉండే విద్యార్థులు సంబంధిత ఫీజును చెల్లించాలన్నారు. అదనపు సమాచారం కోసం 7382929612ను సంప్రదించాలన్నారు.


