News June 6, 2024
నిజామాబాద్: అంచనాలకు మించి BJP జోరు
నిజామాబాద్ పార్లమెంట్లో BJPకి విశ్లేషకుల అంచనాలకు మించి ఓట్లు పోలయ్యాయి. గత ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4.80 లక్షలు ఓట్లు రాగా.. ఈసారి 5.92 లక్షల ఓట్లు వచ్చాయి. NZB రూరల్, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల్లో 15 వేల నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని లెక్కలు కట్టారు. కాని రూరల్ 44వేలు, కోరుట్లలో 33వేలు, బాల్కొండలో 32 వేలు మెజార్టీ దక్కటం గమనార్హం. 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు సాధించడంతో BJP జోరు సాగింది.
Similar News
News October 2, 2024
నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్
నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.
News October 2, 2024
బోధన్: రైలు బోగీలో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్
బోధన్ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. రైల్వే మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ వెల్లడించారు.
News October 2, 2024
కామారెడ్డి: రూ.10 లక్షలతో పోస్టల్ ఉద్యోగి పరార్
రూ.10లక్షల పెన్షన్ డబ్బులతో పోస్టల్ ఉద్యోగి పరారైన ఘటన బీబీపేట్లో చోటుచేసుకుంది. తుజాలాపూర్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్గా పనిచేసే దేవిసోత్ బిక్యానాయక్ పోస్ట్ ఆఫీస్ డబ్బును పక్కదారి పట్టించి గతంలో సస్పెండ్ అయ్యాడు. కాగా గతనెల 30న ఇస్సానగర్, తుజాలాపూర్ గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు SI ప్రభాకర్ వెల్లడించారు.