News September 7, 2024
నిజామాబాద్ అంతా NIGHT OUT

వినాయక చవితి నేపథ్యంలో ఉమ్మజి నిజామాబాద్ యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాల కొనుగోలు చేసేందుకు కామారెడ్డి, నిజామాబాద్కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండటంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.
Similar News
News November 10, 2025
నిజామాబాద్లో కూరగాయల ధరల వివరాలు..!

నిజామాబాద్ లో కూరగాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.20 కేజీ, వంకాయ రూ.35, బెండకాయ బీరకాయ, దొండకాయ రూ.50, చిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.25, కాలిఫ్లవర్ రూ.50, మిరపకాయ రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ, బెండకాయ రూ.50, దొండకాయ రూ.50, పాలకూర రూ.50, తోటకూర రూ.30, గోరుచిక్కుడు రూ.50, మునగా కాయ రూ.70, ఉల్లిగడ్డ రూ.100కు ఐదు కేజీలు, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.50లకు కేజీ ధర పలుకుతున్నాయి.
News November 8, 2025
KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News November 8, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు.


