News February 20, 2025
నిజామాబాద్: ఆకాశవాణి ఎఫ్ఎమ్ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్

నిజామాబాద్ ఆకాశవాణి ఎఫ్ఎమ్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తెలంగాణ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ బానోత్ హరిసింగ్ సందర్శించారు. శ్రోతలకు ఇష్టమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆకాశవాణి ఉద్యోగులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట సుబ్బయ్య, ఇంజినీర్ కార్యక్రమాల నిర్వహణ, పరిపాలన సిబ్బంది, అధికారులు, పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
సూర్యాపేట: మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా..

భవన, ఇతర నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు సంక్షేమం కోసం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశం పెట్టిందని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కే.సీతారామారావు కోరారు. ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టనికి రూ.10 లక్షలు, వైకల్యం పొందితే రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే ఈ పథకంలో జిల్లాలో 1,35,885 కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
News November 24, 2025
బంకుల్లో జీరోతో పాటు ఇది కూడా చూడండి

వెహికల్స్లో పెట్రోల్/ డీజిల్ ఫిల్ చేయిస్తే మెషీన్లో 0 చెక్ చేస్తాం కదా. అలాగే ఫ్యూయల్ మెషీన్పై ఉండే డెన్సిటీ మీటర్ నంబర్స్ గమనించారా? BIS గైడ్లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ పెట్రోల్: 720-775 kg/m³ లేదా 0.775 kg/L, డీజిల్: 820 to 860 kg/m³ ఉండాలి. ఇది ఫ్యూయల్ ఎంత క్వాలిటీదో చెప్పే మెజర్మెంట్. ఇంజిన్ పర్ఫార్మెన్స్, జర్నీకి ఖర్చయ్యే ఫ్యూయల్పై ప్రభావం చూపే డెన్సిటీపై ఇకపై లుక్కేయండి.
Share It
News November 24, 2025
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరు కాలేదు. గతంలో కాళేశ్వరం పుష్కరాలు, ఈఎస్ఐ ఆసుపత్రి కార్యక్రమాల్లోనూ ఎంపీని పక్కనపెట్టిన ఘటనలు ఉన్న నేపథ్యంలో, తాజా పరిణామం ఎమ్మెల్యేలు-ఎంపీ మధ్య సమన్వయ లోపాన్ని మరింత స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనకపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


