News February 20, 2025

నిజామాబాద్: ఆకాశవాణి ఎఫ్‌ఎమ్ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్

image

నిజామాబాద్ ఆకాశవాణి ఎఫ్‌ఎమ్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తెలంగాణ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ బానోత్ హరిసింగ్ సందర్శించారు. శ్రోతలకు ఇష్టమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆకాశవాణి ఉద్యోగులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట సుబ్బయ్య, ఇంజినీర్ కార్యక్రమాల నిర్వహణ, పరిపాలన సిబ్బంది, అధికారులు, పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

తిరుపతి: భక్తులకు గమనిక.. మరికాసేపట్లో

image

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ పంచమి తీర్థం జరగనుంది. అమ్మవారి కోనేరులో స్నానం చేయడానికి లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. ఈక్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కొన్ని సూచనలు చేశారు. ‘రోజంతా పంచమి గడియలు ఉంటాయి. భక్తులు పరుగులు పెట్టవద్దు, ఆత్రుత చెందవద్దు, ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తాం. ఫోన్లు, నగలు, విలువైన వస్తువులను నీటిలోకి తీసుకెళ్లవద్దు’ అని SP కోరారు.

News November 25, 2025

సుబ్రహ్మణ్య స్వామిని పూజించే విధానం ఇదే..

image

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయాన్నే తల స్నానం చేయాలి. తడి బట్టలతో కార్తికేయుడి ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. మురుగన్‌కు పండ్లు, పువ్వులు సమర్పించడం శ్రేయస్కరం. బ్రహ్మచారిగా ఉన్న స్కందుడిని పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. పండుగ నాడు బ్రహ్మచారులకు భోజనం పెట్టి, వస్త్రాలు సమర్పించి గౌరవిస్తారు. కావడి మెుక్కులు తీర్చుకునే ఆచారం కూడా ఉంది. ఫలితంగా పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

News November 25, 2025

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. వయా తిరుపతి

image

APలోని తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపేలా ద.మ. రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. చెన్నై నుంచి HYD వరకు 778km ప్రాజెక్టులో తొలుత గూడూరు మీదుగా రైలు నడపాలని ద.మ. రైల్వే భావించింది. తిరుపతి నుంచి అమలు చేయాలన్న TN విజ్ఞప్తితో కొన్ని సవరణలు చేసింది. దీనికి ఆ ప్రభుత్వం అంగీకరిస్తే చెన్నై-తిరుపతి-HYD బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.