News June 8, 2024
నిజామాబాద్: ఇద్దరు విద్యార్థులు డిబార్
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఎస్ఎస్ఆర్, నరేంద్ర కళాశాల కేంద్రాల్లో విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఉదయం జరిగిన ఆరో సెమిస్టెర్ రెగ్యులర్ పరీక్షలకు 6,086 మందికి 5,670 మంది, మధ్యాహ్నం ఒకటో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 3,050కి 2,840 మంది హాజరైనట్లు పేర్కోన్నారు.
Similar News
News October 3, 2024
NZB: ఢిల్లీ పోలీసులమంటూ బెదిరించి.. నిట్టనిలువునా దోచారు!
పోలీసులమని బెదిరించి లక్షలు కాజేసిన ఘటన NZB జిల్లాలో జరిగింది. బాధితుల ప్రకారం.. ‘పోలీసులం మాట్లాడుతున్నాం.. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో ఉన్నావు.. అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారు’ అని కామారెడ్డికి చెందిన కిషన్ రావుకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్కు రూ.9,29,000 బదిలీచేశాడు. మోసమని గ్రహించి 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 3, 2024
NZB: డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 220 మంది హాజరు
డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది.ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు.
News October 2, 2024
నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్
నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.