News March 30, 2024

నిజామాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వనం

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు, నిరుద్యోగ యువతులకు వివిధ రకాల ఉచిత శిక్షణల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు, 19 నుంచి 45 ఏళ్ల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నెలపాటు వసతి, భోజనం, టూల్‌కిట్స్ ఉచితంగా అందిస్తామన్నారు.

Similar News

News January 14, 2025

NZB: పసుపు రైతుల తరఫున PMకు ధన్యవాదాలు: MP

image

పసుపు రైతుల పక్షాన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. వర్చువల్‌గా మంగళవారం పసుపుబోర్డు ప్రారంభం సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు కోసం నాలుగు దశబ్దాలుగా రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రధాని నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పసుపు పండించే రైతులకు మేలు కలుగుతుందన్నారు. 

News January 14, 2025

నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News January 14, 2025

NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం

image

గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.