News January 13, 2026
నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిసారించింది. మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా, టీపీసీసీ చీఫ్గా ఉండటంతో నిజామాబాద్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున టార్గెట్ మిస్ కావొద్దని భావిస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో దోస్తీతో మేయర్ సీటు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది.
Similar News
News February 14, 2026
NZB: నాలుగు సార్లు ఓటమి.. ఐదో సారి గెలుపు

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిన ఎర్రం గంగాధర్ ఈసారి 43వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంగాధర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగంపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
News February 14, 2026
NZB: నాలుగు సార్లు ఓటమి.. ఐదో సారి గెలుపు

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిన ఎర్రం గంగాధర్ ఈసారి 43వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంగాధర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగంపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్గా పని చేశారు.


