News January 5, 2025
నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736066477000_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలనతో ముందుకు సాగుతున్న విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజీపీకి లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 25, 2025
ఆర్మూర్: డాక్టర్ లక్ష్మణ్ను కలిసిన పల్లె గంగారెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737731169042_51712009-normal-WIFI.webp)
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్ ఎన్నికకు సహకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు, పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.
News January 25, 2025
ఆర్మూర్ : ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737716906889_51712009-normal-WIFI.webp)
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.
News January 24, 2025
NZB: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737708083342_728-normal-WIFI.webp)
అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదర్శనగర్కు చెందిన లక్ష్మీ 52 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె భర్తకు ఏడాది క్రితం హార్ట్ ఆపరేషన్ అయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.