News March 9, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం తూమ్పల్లి, కోటగిరిలో 39.7℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేంపల్లి 39.5, ఆలూరు 39.4, లక్ష్మాపూర్ 39.3, గోపన్నపల్లి 39.2, ముప్కల్ 39.1, మోర్తాడ్ 38.9, మల్కాపూర్, జక్రాన్పల్లి 38.8, కోనసముందర్ 38.4, బాల్కొండ 38.3, మాచర్ల, మదన్పల్లె, వైల్పూర్ 38.2, జనకంపేట్, భీంగల్ 38.1, నిజామాబాద్ 38, పెర్కిట్, యేర్గట్లలో 37.9℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News March 10, 2025
వేల్పూర్: బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ

నిజామాబాద్ వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. ఇండియా జట్టు ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు నవీన్ తెలిపాడు. నవీన్ను గ్రామ ప్రజలు, క్రీడాకారులు, తోటి స్నేహితులు అభినందించారు.
News March 10, 2025
NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగనుందని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు అర్జీలు సమర్పించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు.
News March 10, 2025
నిజామాబాద్ జిల్లాకు రూ.600 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.600 కోట్లు మంజూరయ్యాయి.