News June 22, 2024
నిజామాబాద్ జిల్లాలో బలపడుతున్న కాంగ్రెస్.!
బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి NZB జిల్లాలో ఆ పార్టీ బలం పెరగనుంది. జిల్లాలోని 9 మంది MLAల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. తాజాగా పోచారం చేరికతో ఆ సంఖ్య ఐదుగురికి చేరింది. ఆయన చేరిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Similar News
News October 6, 2024
తాడ్వాయి: గ్రేట్.. మూడు ఉద్యోగాలు సాధించాడు.!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రాజశేఖర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. SA సోషల్, SA తెలుగు, ఎస్జీటి గురుకుల టీజీటీ పోస్టులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు పలు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజశేఖర్కు శుభాకాంక్షలు తెలిపారు.
News October 6, 2024
NZB: నాలుగు క్వింటాళ్ల పండ్లతో అన్నపూర్ణ దేవీగా అమ్మవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.
News October 6, 2024
నిజామాబాద్: ముగ్గురు ఆత్మహత్య..UPDATE
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన <<14277266>>ముగ్గురు <<>>సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఇంటి పనులు ప్రారంభించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.