News April 13, 2025
నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్లు నిజామాబాద్లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 18, 2025
తూ.గో: ముచ్చటగా మూడు పదవులు

తబ.గో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి ముచ్చటగా 3 పదవులు వరించాయి. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రుడా ఛైర్మన్గా ఉన్న ఆయనకు ఇప్పుడు కొత్తగా జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. 3 పదవుల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం అవుతుందా ? కొనసాగిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. రుడా ఛైర్మన్ పదవిని వేరొకరికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
News December 18, 2025
పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతం: వీర బుచ్చయ్య

PDPL జిల్లాలో గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు మూడు దశలో ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని అదనపు జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ, రెవెన్యూ, జడ్పీ, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, నోడల్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, మీడియా కీలక పాత్ర పోషించాయన్నారు. అందరి సమన్వయం, అంకితభావమే ప్రక్రియ విజయానికి కారణమని అన్నారు.
News December 18, 2025
పెంచికల్పేట్ శివారులో పులి సంచారం..!

కమాన్పూర్ మండలం పెంచికల్పేట్- బుర్రకాయలపల్లి మధ్య పొలం మార్గంలో పులి సంచారం జరిగిందన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ కొమురయ్య యాపల వాగు సమీపంలో పులి ఆనవాళ్ల కోసం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పరిశీలనలో స్థానిక నాయకుడు పల్లె నారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.


