News April 13, 2025
నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్లు నిజామాబాద్లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 17, 2025
వైసీపీకి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా

జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక YCPకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని అధినేత జగన్కు లేఖ పంపారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నది అనేది తెలపలేదు. కాగా ఇవాళ ముగ్గురు YCP కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న మేయర్పై అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో నంబర్ గేమ్ ఉత్కంఠగా మారింది.
News April 17, 2025
SRH స్కోర్ ఎంతంటే?

ముంబైతో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(40), క్లాసెన్(37) ఫర్వాలేదనిపించినా హెడ్(29 బంతుల్లో 28), నితీశ్(19), కిషన్(2) విఫలమయ్యారు. ఓ దశలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో SRH బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. చివర్లో అనికేత్ 8 బంతుల్లో 18 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదైంది. విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. MI టార్గెట్ 163.
News April 17, 2025
ADB: పాఠ్యపుస్తకాల గోదాంను తనిఖీ DEO

ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను నిల్వ ఉంచిన గోదాంను DEO శ్రీనివాస్రెడ్డి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు కావాలి.. మనకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయో.. పాఠ్య పుస్తకాల మేనేజర్ సత్యనారాయణను అడిగి తెలుసుకొని ఆరా తీశారు. గోదాంలో నిల్వ ఉంచిన పుస్తకాల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డీఈఓ వెంట సీసీ రాజేశ్వర్ ఉన్నారు.