News June 21, 2024
నిజామాబాద్: తండ్రిని చంపిన కొడుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

తండ్రిని చంపిన కొడుకుకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బోధన్ 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ తీర్పునిచ్చారు. వర్నికి చెందిన వినోద్ తరచూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో 2021 జూన్లో దొంగతనాలు మానేయాలని చెప్పిన అతడి భార్యతో గొడపడ్డాడు. అడ్డువచ్చిన తండ్రిని కర్రతో కొట్టడంతో దూప్యానాయక్ మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పటి SI అనిల్ రెడ్డి కేసు నమోదు చేయగా గురువారం అతడికి జైలు శిక్ష పడింది.
Similar News
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.


