News June 4, 2024

నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ ముందంజ

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపులో మెుదటి రౌండులో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజంలో ఉన్నారు. మెుదటి రౌండులో అర్వింద్ కు 6,506, రెండవ రౌండులో 6114 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మెుదటి రౌండులో 628 ఓట్లు, 519 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 4,776, రెండవ రౌండులో4731 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ధర్మపురి అర్వింద్‌కు 3113 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News November 28, 2025

నిజామాబాద్: నామినేషన్ అభ్యర్థలకు కొత్త బ్యాంక్ అకౌంట్ కష్టాలు

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలతో జీరో అకౌంట్ బ్యాంక్ ఖాతాను జతచేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. ఈ సమాచారం తెలియని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాగా అభ్యర్ధులకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. కొత్త నిబంధన వల్ల అభ్యర్ధులు బ్యాంక్‌లకు క్యూ కడుతున్నారు.

News November 28, 2025

NZB: GPఎన్నికలు.. సిబ్బందికి సీపీ సూచనలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సలహాలు ఇచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ప్రజల భద్రత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ బాధ్యత అని పేర్కొన్నారు.

News November 28, 2025

NZB: ఏకగ్రీవాల కోసం బలవంతం చేయకూడదు: కలెక్టర్

image

జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకాగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించకూడదని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. బలవంతం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహరించాలని కలెక్టర్ కోరారు.