News November 6, 2024
నిజామాబాద్: నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు

ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
NZB: క్షణికావేశంతో ఉరివేసుకొని SUICIDE

జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షణికావేశంతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. బాలనగర్ గ్రామానికి చెందిన మాగేమ్ సాయిలు మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పడి బయటకు వెళ్లాడు. అతని ఆచూకీ కోసం కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని దేవుని గుట్ట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా
News December 24, 2025
నిజామాబాద్: పలువురు సబ్ స్పెక్టర్ల బదిలీ

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. NZB వీఆర్ లో ఉన్న శ్రీనివాస్ను ధర్పల్లి SHOగా, అక్కడ ఉన్న కళ్యాణిని వీఆర్కు, వీఆర్లో ఉన్న జీ. వంశీ కృష్ణను వర్ని, వర్నిలో ఉన్న మహేశ్ వీఆర్కు, నవీపేట్ అటాచ్డ్ ఎస్సైగా ఉన్న తిరుపతిని భీమ్గల్౨కు, భీంగల్ ఎస్సై సందీప్ను 4వ టౌన్కు బదిలీ చేశారు.
News December 24, 2025
NZB: రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.


