News July 20, 2024
నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

*శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18,275 క్యూసెక్కుల ఇన్ ఫ్లో * NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ * పాఠశాల సమయాల్లో మార్పు: నిజామాబాద్ DEO *NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి * రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: మంత్రి జూపల్లి * నిజామాబాద్: ‘నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం’ * GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం
Similar News
News January 4, 2026
నిజామాబాద్: 102 కేసులు నమోదు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. రూ.9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
News January 4, 2026
నిజామాబాద్: రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్న జిల్లా మహిళలు

హైదరాబాద్ రవీంద్రభారతిలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బుగ్గలి రజక స్వప్న(కులవృత్తిలో సేవలు), సురుకుట్ల ఝాన్సీ (వ్యాపార రంగం) తమ రంగాల్లో చూపిన ప్రతిభకు అవార్డులను అందుకున్నారు. ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, కమిటికీ కృతజ్ఞతలు తెలిపారు.
News January 4, 2026
టర్కీలో గుండెపోటుతో వేల్పూర్ వాసి మృతి

వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. బతుకుతెరువు కోసం టర్కీ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. కొద్దరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.


