News July 16, 2024
నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
Similar News
News November 2, 2025
నిజామాబాద్: అలసత్వ వహిస్తే ఉపేక్షించేది లేదు: బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలుపై కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. భవానిపేట, గొరెగామ్లలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News November 2, 2025
రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NZB జిల్లా కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరి సీ, క్యాటగిరి డీలలోని ఓటర్లను కేటగిరి ఏకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని ఆదేశించారు.
News November 1, 2025
NZB: కలెక్టర్, సీపీతో ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ భేటీ

రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం NZB కలెక్టరేట్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యలపై బాధితుల నుంచి విజ్ఞాప్తులు స్వీకరించారు.


