News December 13, 2024

నిజామాబాద్: పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని పండుగల నిర్వహించి విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టర్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

Similar News

News October 26, 2025

కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

image

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.

News October 26, 2025

నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్‌ నగర శివారులోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.

News October 26, 2025

నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

image

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.