News March 25, 2024

నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

Similar News

News September 18, 2025

NZB: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

TU: RSS ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

image

తెలంగాణ యూనివర్సిటీ RSS శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య వక్తగా డా.కాపర్తి గురుచరణం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయదశమి ఉత్సవమనేది విజయానికి ప్రతీక అన్నారు. అటు RSS 100సం.రాలలో సాధించిన విజయాలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఖండ సహా కర్యవహ సంతోష్, సాంగు,మధు,శ్రవణ్, దిగంబర్,రమణ తదితరులున్నారు.

News September 18, 2025

కమ్మర్‌పల్లి: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

image

చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో మరణించారు. ఈ ఘటన కమ్మర్‌పల్లిలోని గాంధీనగర్‌లో జరిగింది. మృతులు కొండపల్లి లక్ష్మణ్(39), చిత్తారి నర్సు(30)గా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారి 63 పక్కన ఉన్న చౌటా మోటా కాలువలో చేపలు పడుతుండగా, 11KV హై టెన్షన్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. లక్ష్మణ్ భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.