News February 19, 2025

నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం

image

ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే నియోజకవర్గాలు చాలా పెద్ద పరిధి కలిగి ఉంటుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుస్తూ ప్రచారం చేయడం పెద్ద సవాలే. అయితే ఇప్పుడు అభ్యర్థులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్తగా పోలింగ్ వివరాలు తెలుపుతూ.. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని SMSరూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మీకు మెసేజ్‌లు వస్తున్నాయా..? కామెంట్ చేయండి.

Similar News

News March 19, 2025

NZB: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 743 మంది ఆబ్సెంట్

image

నిజామాబాద్ జిల్లాలో బుధవారంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు మొత్తం 743 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లాలో మొత్తం 19,349 మంది విద్యార్థులకు 18,606 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినట్లు రవి కుమార్ వివరించారు.

News March 19, 2025

NZB: నేడే బడ్జెట్.. జిల్లాకు కావాలి నిధులు

image

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బుధవారం ఉదయం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. అలాగే గోదావరి పరివాహ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మరి బడ్జెట్ కేటాయింపు ఎలా ఉండనుందో.?

News March 19, 2025

భీమ్‌గల్: చేపల వలలో చిక్కుకొని జాలరి మృతి

image

చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!