News June 5, 2024
నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తా: ఎంపీ ధర్మపురి
నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద సవాల్ విసిరారు.
Similar News
News October 2, 2024
బోధన్: రైలు బోగీలో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్
బోధన్ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. రైల్వే మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ వెల్లడించారు.
News October 2, 2024
కామారెడ్డి: రూ.10 లక్షలతో పోస్టల్ ఉద్యోగి పరార్
రూ.10లక్షల పెన్షన్ డబ్బులతో పోస్టల్ ఉద్యోగి పరారైన ఘటన బీబీపేట్లో చోటుచేసుకుంది. తుజాలాపూర్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్గా పనిచేసే దేవిసోత్ బిక్యానాయక్ పోస్ట్ ఆఫీస్ డబ్బును పక్కదారి పట్టించి గతంలో సస్పెండ్ అయ్యాడు. కాగా గతనెల 30న ఇస్సానగర్, తుజాలాపూర్ గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు SI ప్రభాకర్ వెల్లడించారు.
News October 2, 2024
NZB: బస్సు పైన ప్రమాదకరంగా ప్రయాణం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు రావడంతో మంగళవారం బస్స్టాండ్లు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారడంతో కొందరు ప్రమాదకరంగా బస్సు మీదకు ఎక్కి ప్రయాణించారు. కాగా పండుగ నేపథ్యంలో బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.