News February 13, 2025
నిజామాబాద్: ప్రయోగ పరీక్ష కేంద్రాలు తనిఖీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444513393_51712009-normal-WIFI.webp)
పరీక్ష కేంద్రాలలో కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్లను DIEO రవికుమార్ ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా పలు ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
Similar News
News February 14, 2025
NZB: పొలంలో పడి రైతు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739457643657_51940040-normal-WIFI.webp)
పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన సొన్ కాంబ్లె రమేశ్(35) గురువారం ఉదయం పొలంలో మందు చల్లడానికి వెళ్లి పడి మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మందు సంచిని తలపై పెట్టుకుని గట్టు పైన నడుస్తూ ఉండగా కాలుజారి ప్రమాదవశాత్తు బురదలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
News February 13, 2025
ఆలూర్లో కుంటలో పడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739443911895_51712057-normal-WIFI.webp)
ఆలూర్ వెంకటేశ్వర గుట్ట వద్ద తవ్విన కుంటలో ముత్తేన్న అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక మద్యానికి అలవాటు పడి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కుంటలో ఆయన మృతదేహం బయటపడింది.
News February 13, 2025
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్కు జిల్లా వాసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368217053_52305189-normal-WIFI.webp)
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడలో జరుగునుంది. ఈ టోర్నమెంట్కు జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు జాకోర ZPHSకు చెందిన PET స్వామి కుమార్, డిచ్పల్లి ZPHSకు చెందిన PET స్వప్న రాష్ట్ర జట్టుకు సారథులుగా ఎంపికైయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , SGF కార్యదర్శి నాగమణి వారిని అభినందించారు.