News May 24, 2024

నిజామాబాద్: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ -2024 పరీక్ష

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాలిసెట్-2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఏ.ఎన్. ఫణిరాజ్ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహించారు. 5586 మంది విద్యార్థుల నుంచి 2559 మంది బాలురు, 2402 మంది బాలికలు హాజరుకాగా మొత్తం 88.81 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

Similar News

News February 16, 2025

NZB: నిబంధనలు తప్పకుండా పాటించాలి: ఇన్‌ఛార్జ్ సీపీ

image

ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని నిజామాబాద్ ఇన్‌ఛార్జి CP సింధుశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు.

News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

నిజామాబాద్: 18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

నిజామాబాద్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

error: Content is protected !!