News November 26, 2024
నిజామాబాద్: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్

న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. NZBకి చెందిన కాంత్రికుమార్కు ఇద్దరు కుమార్తెలు. కాగా, తన 18 నెలల కూతురు నేహశ్రీ మానసిక అనారోగ్యంతో రెండు సార్లు ఆపరేషన్ చేయించాడు. అయినా కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది నేహశ్రీతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Similar News
News November 21, 2025
NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
News November 21, 2025
SRSP: 947.474 TMCల వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.
News November 21, 2025
NZB: ఎన్నికల సాధారణ పరిశీలకునిగా శ్యాంప్రసాద్ లాల్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం NZB జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకునిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి జీవీ.శ్యాంప్రసాద్ లాల్ను, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా KMR జిల్లా ఆడిట్ అధికారి జె.కిషన్ పమర్ను నియమించినట్లు పేర్కొన్నారు.


