News March 14, 2025

నిజామాబాద్‌: మనిషి పుర్రె, ఎముకల కలకలం

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల శివారులో గురువారం మనిషి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. గాంధీనగర్‌కి చెందిన వ్యక్తులు పని నిమిత్తం బినోల శివారు అడవిలోకి వెళ్లగా మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయన్నారు. గాంధీనగర్ కారోబార్ చింతల మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో స్థానికంగా ఎవరైనా అదృశ్యమయ్యారా విచారణ చేస్తామన్నారు.

Similar News

News March 22, 2025

ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో తారలు వీరే

image

ఈరోజు సాయంత్రం ఆరింటికి IPL ఓపెనింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీటిలో బాలీవుడ్ తారల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నటీనటులు దిశా పటానీ, శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ డాన్సులు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ పాటలు, పంజాబీ ఆర్టిస్ట్ కరణ్ ఔజ్లా ర్యాప్ ఆరంభోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక 7.30 గంటలకు KKR, RCB మధ్య మ్యాచ్ మొదలుకానుంది.

News March 22, 2025

NRPT: జలం ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు..!

image

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ నీటి దినోత్సవ సందర్భంగా వినూత్నంగా జల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జలవనులను ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు.. అంటూ చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి? నీటిని వృథా చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీచర్స్ పాల్గొన్నారు.

News March 22, 2025

రేపు, ఎల్లుండి వర్షాలు

image

TG: నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.

error: Content is protected !!