News September 1, 2024
నిజామాబాద్: ముగ్గురు విద్యార్థినులు మృతి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నస్రుల్లాబాద్ మండలంలో విద్యుదాఘాతంతో విద్యార్థిని స్వాతి(18) మృతి చెందింది. కాగా స్వాతి ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. బాన్సువాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అంజలి (12) జ్వరం, వాంతులతో మృతి చెందింది. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని (15) ఉరేసుకుంది.
Similar News
News November 15, 2025
నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

నిజామాబాద్లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
News November 15, 2025
NZB: 17న జరిగే పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయండి

ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. శనివారం వారు 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల బకాయిల సత్వర చెల్లింపులు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు జరిపే ధర్నా కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. శ్రీధర్, నర్సింహస్వామి, బన్సీలాల్ పాల్గొన్నారు.
News November 15, 2025
NZB: పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: సుదర్శన్ రెడ్డి

NZB జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్ఓబీ పనుల పురోగతి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


