News February 20, 2025
నిజామాబాద్: రాష్ట్రంలో BRS అధికారంలోకి రావడం కలనే: మహేశ్

తెలంగాణలో ఇక BRS అధికారంలోకి రావడం కలనే అని, రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ.. BRS, BJP నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష లీడర్ హోదాను KCR.. KTR, హరీశ్రావ్కు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Similar News
News February 22, 2025
24న నిజామాబాద్కు ముఖ్యమంత్రి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న CM రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
News February 22, 2025
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేసి మాట్లాడారు.
News February 22, 2025
నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.