News February 24, 2025

నిజామాబాద్: రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత KCRకు లేదు: TPCC చీఫ్ 

image

విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్‌లో పడుకునే KCRకు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రులను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి గుండె నిండా ఉందని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2025

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మరణించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. భవానిపేట వాసి మాగిరి లింగారం(57) తన ద్విచక్ర వాహనంపై చేపలను అమ్మి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేశ్ తెలిపారు.

News February 25, 2025

NZB: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు: ఆర్ ఎం

image

మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ నెల 25, 26, 27 తేదీల్లో NZB, KMR, ఆర్మూర్ నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ RM జ్యోత్స్న సోమవారం తెలిపారు. మొత్తం రీజియన్ పరిధిలో 136 బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయానికి, మద్దికుంట బుగ్గ లింగేశ్వర, కొమురవెల్లి మల్లన్న సన్నిధికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఈసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 25, 2025

NZB: మద్యం ప్రియులకు షాక్..  

image

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ నిర్వహించాలని ఎక్సైజ్ సీఐ దిలీప్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను మద్యం వ్యాపారులు తప్పనిసరిగా అమలు పరచాలని సూచించారు.

error: Content is protected !!