News June 14, 2024
నిజామాబాద్: రైల్వేస్టేషన్లో గొడవ.. ఒకరి మృతి

నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఇద్దరు మధ్యలో జరిగిన గొడవలో ఒకరు మృతిచెందినట్లు శుక్రవారం రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్లోని ప్లాట్ఫాం1లో నాందేడ్కు చెందిన సతీశ్శర్మ, రాజు ఇద్దరు గొడవపడ్డారు. ఈ గొడవలో సతీష్శర్మ, రాజును నెట్టివేశాడు. దీంతో రాజు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.
Similar News
News December 5, 2025
NZB: ఈ నెల 14 నుంచి ఓపెన్ యునివర్సిటీ పీజీ తరగతులు ప్రారంభం

డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ అధ్యయన కేంద్రంలో పీజీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల14వ తేది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డా.రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 738 2929612, www.braouonline.inను సందర్శించాలన్నారు.
News December 5, 2025
NZB: ఈ నెల 14 నుంచి ఓపెన్ యునివర్సిటీ పీజీ తరగతులు ప్రారంభం

డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ అధ్యయన కేంద్రంలో పీజీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల14వ తేది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డా.రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 738 2929612, www.braouonline.inను సందర్శించాలన్నారు.
News December 4, 2025
NZB: ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు.


