News August 9, 2024
నిజామాబాద్: లిఫ్ట్లో ఇరుక్కున్న నలుగురు చిన్నారులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723169049291-normal-WIFI.webp)
నిజామాబాద్ ముబారక్నగర్లోని సాయి అటాకరి అపార్ట్మెంట్లో రాత్రి నలుగురు చిన్నారులు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. మూడో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు చిన్నారులు లిఫ్ట్ ఎక్కగా.. లిఫ్టుకు ఉన్న రెండు తీగల్లో ఒకటి తెగిపోయి కిందకు జారింది. మరో తీగ లిఫ్టు పై ఉన్న రింగులో చిన్నారులు చిక్కుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆపార్ట్మెంట్ వాసులు వెంటనే లిఫ్ట్ మరమ్మతులు చేయించి పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు.
Similar News
News February 6, 2025
NZB: రైలులోంచి పడి యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738836197465_50486028-normal-WIFI.webp)
రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్కు సంప్రదించాలన్నారు.
News February 6, 2025
జక్రాన్పల్లి: విలువైన నిషేదిత మత్తు పదార్థాల దహనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738837221320_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 కేసులలో పట్టుబడిన రూ.12కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్లో గురువారం దహనం చేశారు. ఈ మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72.2 కిలోల డైజీపాం, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
News February 6, 2025
NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738825839126_50139228-normal-WIFI.webp)
సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.