News February 25, 2025
నిజామాబాద్: వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, నాబార్డు డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
NZB: చోరీకి పాల్పడిన మహిళలకు దేహశుద్ధి

ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఠాణాకలాన్లో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన గిర్మారెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం NZBలో నివాసముంటున్నాడు. గత 9 నెలలుగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించిన బెంగి గంగామణి, ఎరుకల శ్యామల, సునీతలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో చోరి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
News March 21, 2025
నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

నిజమాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. శుక్రవారం కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం లభించినపట్టికీ పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
News March 21, 2025
NZB: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఇప్పటికే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెల 22న మొదటి దశ (ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్), 24 నుంచి రెండో దశ (ఫిజిక్స్, ఎకనామిక్స్), 26 నుంచి మూడో స్పెల్ (కెమిస్ట్రీ, కామర్స్), 28వ తేదీ నుంచి నాలుగో స్పెల్ (హిస్టరీ, బోటనీ, జువాలజీ) మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు.