News February 20, 2025
నిజామాబాద్: విషాదం.. మృతులంతా ఒకే FAMILY

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామ శివారులో పొలాల్లో గురువారం ఉదయం కరెంట్ షాక్తో <<15520125>>ముగ్గురు మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓర్సు గంగారాం(45), బాలమణి (40) వారి కొడుకు కిషన్(22) ఉదయం పంట పొలంలో వరికి నీరు పెట్టేందుకు వెళ్లగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు మృతిచెందినట్లు భావిస్తున్నారు.
Similar News
News October 21, 2025
NCLTలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో లా రీసెర్చ్ అసోసియేట్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB/LLM, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.60వేలు (ఢిల్లీలో రూ.80వేలు). వెబ్సైట్: https://nclt.gov.in/
News October 21, 2025
కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలు

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి
★ మహానందీశ్వర స్వామి, యాగంటీశ్వర క్షేత్రం
★ ఆత్మకూరు రుద్రకోటేశ్వర స్వామి క్షేత్రం
★ ఓంకారేశ్వర ఆలయం
★ గడివేముల దుర్గా భోగేశ్వర స్వామి
★ బేతంచర్ల ముచ్చట్ల మల్లికార్జున స్వామి
★ ఆళ్లగడ్డ కాశింతల క్షేత్రం
★ కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వర స్వామి క్షేత్రం
News October 21, 2025
శివోహం.. అనంతపురం జిల్లాలో దర్శనీయ శివాలయాలు

రేపటి నుంచి కార్తీకమాసం. ఈ నెలలో అనంతపురం జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి
★ కూడేరు జోడి లింగాల క్షేత్రం
★ పామిడి భోగేశ్వర స్వామి
★ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం
★ అమరాపురం సిద్దేశ్వర స్వామి, కంబదూరు మల్లేశ్వర స్వామి
★ గార్లదిన్నె కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
★ బుక్కరాయసముద్రం కాశీ విశ్వనాథ క్షేత్రం
★ బత్తలపల్లిలో కాటి కోటేశ్వర స్వామి క్షేత్రం