News November 21, 2024

నిజామాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది కానిస్టేబుళ్లు 

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సుమారు 250 మంది పోలీసులు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలో గల జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో గురువారం పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Similar News

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.