News March 6, 2025
నిజామాబాద్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది..!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
Similar News
News November 18, 2025
NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.
News November 18, 2025
NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.


